Site logo

కుటుంబ కలహాలతో మహిళ తన కూతురుతో ఆత్మహత్య

Jammikunta – Suicide in Vanthadupula Village of Ellandakunta Mandal

ఇల్లందకుంట మండలం వంతడుపుల గ్రామంలో నిన్న రాత్రి రమ్య అనే మహిళ తన భర్త రాజేష్ తో గొడవ పడి కూతురుని తీసుకొని బయటకు వచ్చింది. భర్త మరియు కుటుంబ సభ్యులు తాను తన తల్లి గారింటికి వెళ్లిందని అనుకుంటుండగా తెల్ల వారి ఇంటి ప్రక్కన ఉన్న బావిలో తన కూతురు మనస్విని(3) సంవత్సరాల పాపతో సహా రమ్య(25) శవమై తేలింది. దీంతో ఆ ఊరు శోక సంద్రంగా మారింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారి భౌతిక కాయాల్ని వెలికి తీసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

  • No comments yet.
  • Add a comment